రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాసిరకంగా సినిమాలు తీస్తున్నాడు. వర్మ నుండి నికార్సైన సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అందరికీ వర్మ సినిమాలంటే ఒక రకమైన నిస్తేజం వచ్చేసింది. అయినా సరే రామ్ గోపాల్ వర్మ యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నాడంటే కచ్చితంగా అందులో ఏదో విశేషముంటుంది.
ముఖ్యంగా ఆ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చూపించడం వర్మకే చెల్లింది. 2019 నవంబర్ లో తెలంగాణలో సంచలనం రేపిన దిశా అత్యాచారం, హత్య సంఘటనల ఆధారంగా దిశా ఎన్కౌంటర్ ను తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఆ వర్మ మళ్ళీ ఈ జోనర్ లో సక్సెస్ అవుతాడని అనిపిస్తోంది. చాలా ఎఫెక్టివ్ గా ట్రైలర్ కట్ ఉంది. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నట్టి కరుణ నిర్మిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!