Ram Gopal Varma : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, హత్య ఘటనపై రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న దిశా ఎన్ కౌంటర్ చిత్రం నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే..ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇప్పటికే యూట్యూబ్ లో విడుదల చేశారు.. ఇటీవల ఈ చిత్రం నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు .. వివాదాలు, విమర్శ లతోనే చెలగాటమాడే రాంగోపాల్ వర్మకు చుక్కెదురైంది.. తాజాగా రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న దిశా ఎన్ కౌంటర్ సినిమా ను సెన్సార్ బోర్డు కమిటీ రిజెక్ట్ చేసింది..
దిశా కేసులో ఎన్కౌంటర్ అయినా దోషులు శివ నవీన్ చెన్నకేశవులు కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ న్యాయ కమిషన్ కు విజ్ఞప్తి చేశారుచేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఎన్కౌంటర్ మృతుల కుటుంబాల తరుపున న్యాయవాది కృష్ణమూర్తి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే వారి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. ఇలాంటి తరుణంలో వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వారిని ఊరిలో కూడా ఉండని పరిస్థితి ఉందన్నారు. దిశా ఎన్ కౌంటర్ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు..
ఈ సినిమాను ఆపాలంటూ గతంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు . ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సరికాదన్నారు. కుమార్తెను కోల్పోయి ఇప్పటికీ ఎంతో బాధ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం పై వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమాపై కూడా కోర్టు