ESI కుంభకోణం విషయంలో మాజీమంత్రి టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ప్రజెంట్ ఆయన హెల్త్ పరిస్థితి సరిగ్గా లేదని పైల్స్ ఆపరేషన్ జరిగిందని ముందు నుంచి టిడిపి నాయకులు కుటుంబసభ్యులు అంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అచ్చెనాయుడికి రక్తస్రావం అవుతున్నట్లుగా ఆపరేషన్ తిరగబడి నట్లుగా వైద్యులు ఇటీవల చెబుతున్నట్లు వార్తలు అందుతున్నాయి.
అంతేకాకుండా ఇటీవల విడుదలైన అచ్చెన్నాయుడు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన దానిలో వైద్యులు ఇదే విషయాన్ని తెలిపారు. ఆయనకి రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లు, ఆయన కాళ్ళు మరియు చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాట్లుగా గుంటూరు జిజిహెచ్ వైద్యులు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తన బాబాయ్ అచ్చం నాయుడు ఆరోగ్యం విషయంలో వేరే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించడానికి రంగంలోకి రామ్మోహన్ నాయుడు దిగినట్లు సీఎం జగన్ ని స్పెషల్ రిక్వెస్ట్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.