రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తన పవర్ ప్యాక్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పూర్తి మాస్ కటింగ్ లో కనిపించిన రామ్ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ఎనర్జిటిక్ హీరో.. మరో మాస్ ఎంటర్టైనర్ రెడ్ సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కానీ కరోనా కారణంగా పెండింగ్ లో పడుతూ వస్తోంది. మరి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది. అయితే ఆ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కానీ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి న్యూస్ ఏదీ అఫీషియల్ గా రాలేదు. కానీ లేటెస్ట్ గా రామ్ లేటెస్ట్ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువు త్రివిక్రం తో సెట్ కాని ప్రాజెక్ట్ శిష్యుడితో సెట్ అయిందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ గా భీష్మ సినిమా ద్వారా భారీ సక్సస్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని దర్శకత్వం బాధ్యత శిష్యుడు వహిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ముందుగా త్రివిక్రమ్ రామ్ కోసం రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు తన శిష్యుడికి ఇస్తున్నాడని ప్రస్తుతం చర్చించుకుంటున్నారట.
ఒకవేళ అదే జరిగితే గురుశిష్యులు ఇద్దరి రామ్ మూవీ ఉండనుందని టాక్ జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో లేదా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. భీష్మ హిట్ తర్వాత వెంకీ మరో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నా స్టార్ హీరోలంతా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమధ్య మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కూడా వెంకీ కుడుముల సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. మరి వెంకీ కుడుముల నెక్స్ట్ ప్రాజెక్ట్ రాం చరణ్ తోనా లేక రాం తోనా అన్నది త్వరలో క్లారిటీ రానుందని సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!