టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ ఏ సినిమా చేసినా అందులో తన ఎనర్జి ఏమాత్రం తగ్గదని నిరూపిస్తాడు. అందుకే రామ్ పోతినేని క్లాస్ కంటే మాస్ సినిమా చేస్తేనే కిక్కు ఉంటుందని అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ఏ హీరో అయినా ఏ జానర్లో సినిమా చేసి హిట్ కొట్టినా వచ్చే పాపులారిటీ కంటే, మాస్ ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ సినిమా విజయంతో వచ్చే ఫేమ్ డిఫరెంట్గా ఉంటుందని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. అదీగాక ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న వారంతా కమర్షియల్ సినిమాలతోనే క్రేజీ స్టార్స్ గా ఎదిగారు.
అందుకే ప్రయోగంలో ఒకటి రెండు సార్లు చేతులు కాలినా ఒక్క హిట్ కొడితే చాలు నిలబడిపోవచ్చు అనే లెక్కన ఇలాంటి సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారు. ఈ రూటే ఫాలో అవుతున్న రామ్ పక్కా కమర్షియల్ సినిమాల మీద ఎక్కువగా గురిపెట్టి పెద్ద దెబ్బలే తిన్నాడు. అలా చివరికి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో గట్టి స్టాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ ను మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేయడమే కాదు, ఇతనికి మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. అందుకే అయన తర్వాతి చిత్రం ‘రెడ్’కు మంచి హైప్ ఏర్పడింది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ రీమేక్ చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రం విడుదలకు కరోనా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయినా గానీ ఈ మూవీకి ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా మేకర్స్ థియేటర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని ఉంచుతారనే వార్తలు ఆ మధ్య కాలంలో వచ్చినా రూటు మార్చిన చిత్రబృందం సంక్రాంతి బరి నుంచి డ్రాపయి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారని సమాచారం. మరి ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏది రానప్పటికి దాదాపు అదే ఫైనల్ అని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?