Sunitha: ఇటీవల సింగర్ సునీత మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత Ram Veerapaneni వివాహం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. వీరి వివాహం గత నెల 9 వ తేదీన చాలా ఘనంగా జరిగింది. వారి పెళ్లి జరిగిన సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సునీత మరియు రామ్ వీరపనేనిల పెళ్లి హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా వీరి వివాహం పై సోషల్ మీడియాలో ఎన్నో పాజిటివ్ కామెంట్స్ అలాగే మరెన్నో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. తాజాగా రామ్ వీరపనేని పిల్లలు ఆకాష్ మరియు శ్రేయ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట.
టాలీవుడ్ సింగర్ గా దుబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత ఎంత పాపులర్ ఓ రామ్ వీరపనేని కూడా డిజిటల్ మీడియా లో అంతే పాపులర్. సునీత తన స్వర మాధుర్యంతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది.
సునీత భర్త రామ్ వీరపనేని త్వరలోనే పిల్లలు ఇద్దరిని తన వ్యాపారాలలో భాగస్వాములుగా చెయ్యనున్నట్లు సమాచారం. రామ్ వీరపనేని సింగర్ సునీతను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆకాష్ మరియు శ్రేయ ల ఆలనా పాలనా కూడా ఆయనే చూసుకుంటున్నారు.
అయితే అందులో భాగంగానే రామ్ వీరపనేని ఆకాష్ కు ఓ ఫామ్ హౌస్ తో పాటు మ్యాంగో వీడియో సంస్థ లో 20 శాతం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే శ్రేయ కి కూడా మ్యాంగో వీడియోస్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చారట. అంతే కాకుండా ఆయన రెండు బంగళాలు కూడా శ్రేయ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ వీరపనేని చేసిన పనికి సునీతతో పాటు ఇద్దరు పిల్లలు కూడా షాక్లో ఉన్నారట.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.