ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో హీరోయిన్ రమ్యకృష్ణ పేరు తెగ వైరల్ అవుతోంది. 50 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ అదే అందంతో, అభినయంతో మరియు శరీర సౌష్టవంతో తెలుగువారిని ఆలరిస్తున్న రమ్యకృష్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆమె తరచూ లాక్ డౌన్ లో చేసే కార్యకలాపాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్యనే రామకృష్ణ పేరు వార్తల్లో చాలా బాగా హైలెట్ అయ్యింది కానీ అది ఆమె అనుకోని విధంగా మరియు కోరుకోని విధంగా.
https://www.instagram.com/p/CCv3h9kDDGy/?igshid=1bc07b66ptjou
రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం లభించడంతో అటు తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఇలాంటి సమయంలో తాజాగా రమ్యకృష్ణ షేర్ చేసిన ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. లాక్ డౌన్ లో తాను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పిన రమ్యకృష్ణ ఓ విధంగా చెప్పాలంటే లాక్ డౌన్ అనేది తన జీవితంలో ముఖ్యమైన దశ్స్ అని.. ఇంతటి ఖాళీ సమయం, ఏకాంతం తనకు గతంలో ఎన్నడూ దొరకలేదు అని…. చాలా హాయిగా ఉందని.. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లాడిన రమ్యకృష్ణ తాజాగా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోని చూసి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన మూడ్ నెట్ ఫ్లిక్స్ తో చిల్ అయ్యేలా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఫోటో చూసి నెటిజనులు ఈ వయసులో కూడా రమ్యకృష్ణ అందానికి ఫిదా అవుతున్నారు. అమ్మ పాత్రలు చేయడం ఆపేయండి ఇక హీరోయిన్ గా ట్రై చేయండి అని చాలా కొంటెగా సలహాలు ఇస్తున్నారు.
మరో వైపు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా సాగుతోంది. బాహుబలి లో శివగామిగా చేసిన తర్వాత రమ్యకృష్ణ సినిమాలు చేయడంలో మరింత స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఆమె కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’, పూరీ-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ‘ఫైటర్’ లో మరియు సాయి ధరంతేజ్ చిత్రం లో నటిస్తోంది. రమ్యకృష్ణ జోష్ చూస్తుంటే ఆమె ఇప్పట్లో ఆగేలా లేదు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!