‘ఆర్.ఆర్.ఆర్’ .. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్. పోరాట యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్.. కొమరం భీం గా ఎ.టి.ఆర్ నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ని ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య .. డీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రీయ శరణ్, ఓలియా మోరీస్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోవిడ్ కారణంగా దాదాపు 7 నెలలు చిత్రీకరణ ఆగిపోయిన ఈ సినిమా.. లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా రామరాజు ఫర్ భీం తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా – నందమూరి అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పారు.
తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా భారీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైందని.. ఈ క్లైమాక్స్ కోసం భీమ్ – రామరాజు కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారని.. తారక్ – చరణ్ ఇద్దరు చేతులను కలిపి ఉన్న ఓ ఫోటోను అభిమలతో పంచుకున్నారు. ఇక ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ప్రచారం అవుతోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. ఇప్పటికే చరణ్ – తారక్ ల టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే.