విజయవాడలోని రమేష్ ఆసుపత్రి కోవిద్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి అసలు కారణాలను విశ్లేషించిన స్పెషల్ కమిటీ నాలుగు పేజీల దర్యాప్తు నివేదికను సమర్పించింది.
ఈ నివేదికలో పొందుపరచిన సమాచారం ప్రకారం రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. ఈ విషయం యజమానులకు కూడా బాగా తెలుసనీ, కేవలం అధిక ఖర్చులు అవుతాయన్న కారణంతో వాటిని సరిచేయకుండా అలాగే వదిలేశారని తేల్చారు. అందుకే వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉన్నారు.