రామోజీ రావు.. మీడియా మొఘల్. ఆయన తన మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించినట్టుగా ఎవ్వరూ విస్తరించలేకపోయారు. మహామహులను ఆయన చూశారు. వేల కోట్ల అధిపతి. రామోజీ ఫిలిం సిటీతో పాటు ఈనాడు, ఈటీవీ, ఇతర బిజినెస్ లు.. ఎన్నో.. మరెన్నో.. అన్నింటినీ ఒక్క తాటిపైకి నడిపిస్తూ.. పారదర్శకతే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నారు రామోజీ రావు. రామోజీ రావు నోటివెంట కాంప్రమైజ్ అనే పదమే వినపడదు. ఓటమి ఎరుగని ధీరుడు రామోజీరావు అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం.
అయితే కరోనా వల్ల రామోజీ ఓటమికి చేరువవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. రామోజీ ఫిలిం సిటీని మెయిన్ టెన్ చేయడానికి కూడా డబ్బులు లేవని.. రామోజీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని వార్తలు గుప్పుమన్నాయి.వాటన్నింటినీ తొక్కేస్తూ.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రామోజీ గ్రూప్. ఈటీవీ.. మీటీవి అంటూ అందరికీ మొట్టమొదటగా చేరువైన ఎంటర్ టైన్ మెంట్ చానెల్ ఈటీవీని నెలకొల్పి 25 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఈటీవీ విభాగంలోని ఉద్యోగులందరికీ సంస్థ బోనస్ లు ప్రకటించింది.
ఈటీవీ సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా గ్రాండ్ గానే జరుపుకుంటూ ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు అందించింది.నిజానికి రామోజీ గ్రూప్ లో బోనస్ ల మాట ఎత్తేవారు ఉండరు. ఎత్తిన వారు కంపెనీలో ఉండరు. ఏదో ఈనాడులో మాత్రం బోనస్ లు గట్రా ఇస్తుంటారు కానీ.. మిగితా విభాగాల్లో బోనస్ ల మాటే వినడం కష్టం.అటువంటి సంస్థ కరోనా కాలంలోనూ 25 ఏళ్ల ప్రస్థానం పేరుతో ఈటీవీ ఉద్యోగులకు బోనస్ లను ప్రకటించింది.. అంటే అది మామూలు విషయం కాదు.
ఎందుకంటే.. ప్రస్తుతం మీడియా పరిస్థితి ఎలా ఉన్నదో అందరికీ తెలుసు. కొన్ని మీడియా సంస్థలు చాలామంది ఉద్యోగులను తొలగించాయి. ఇంకొన్ని నో వర్క్ నో పే విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఈనాడు కూడా కొందరిని తొలగించింది.కానీ.. ఇటువంటి పరిస్థితుల్లో జీతాల్లో కోత పెట్టకుండా… ఈటీవీ ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం మాత్రం హర్షించదగ్గ పరిణామం. అభినందించాల్సిన విషయం.