Breaking: రంపచోడవరం ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్య గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలను అవమానించేలా వ్యవహరించారు. అది కూడా పోలీసుల సమక్షంలో. విషయంలోకి వెళితే ప్రవీణ్ ఆదిత్య ఇటీవల రంపచోడవరం ఐటిడిఎ పిఓ గా పోస్టు రావడం జరిగింది. ఈ క్రమంలో ట్రైబల్ ప్రాంతం కావడంతో చాలామంది గిరిజన ప్రాంతానికి ప్రజలు అక్కడ నివాసం ఉంటారు.
ఇటువంటి తరుణంలో ఒక సమస్య కోసం ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్య కార్యాలయం వద్దకు గిరిజన ప్రాంత ప్రజలు మాట్లాడటానికి వచ్చిన సమయంలో వారినందరినీ నేలపై కూర్చోబెట్టడం జరిగింది. కూర్చున్న వారిలో మాజీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ సంఘటన జరిగిన టైంలో పక్కనే పోలీసులు ఉన్నాగాని ఏం చేయలేదు. దీంతో తాజాగా ఈ సంఘటన బయటపడటంతో ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్య పై విమర్శలు వస్తున్నాయి. వివక్షతో ఈ విధంగా ఉన్నత అధికారుల వ్యవహరించడం దారుణం అని నేలపై కూర్చోబెట్టడం ఖచ్చితంగా గిరిజనులను అవమానించడమే అంటూ చాలామంది ఈ వార్త పై మండిపడుతున్నారు.
An arrogant IAS officer Praveen Aditya who is posted as Rampachodavaram ITDA PO has summoned tribal leaders, for talks.He made all tribal leaders including a former women MLA to sit on the floor under police detention. It’s an insult to tribal community @HansrajMeena @TribalArmy pic.twitter.com/2TDeraA3pQ
— Telaprolu Srinivas (@srinitelaprolu1) August 24, 2021