న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ అనర్హత వేటు వ్యవహారంలో టిఆర్ఎస్ బహిష్కృత నేత రాములు నాయక్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
తుది తీర్పు ఇచ్చే వరకూ ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి, మండలి చైర్మన్కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అప్పటి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీ రాములు నాయక్పై అనర్హత వేటు వేయగా ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో పాటు మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాములు నాయక్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాములు నాయక్ పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.