రమ్యకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంటరయ్యాకా కొన్ని ఫ్లాప్స్ చూసింది. దాంతో అందరూ ఐరెన్ లెగ్ అని కామెంట్స్ చేశారు. కాని ఆ తర్వాత వరసగా మెగాస్టార్, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్ లాంటి స్టార్స్ పక్కన నటించడానికి రమ్యకృష్ణ నే బెస్ట్ ఛాయిస్ అన్న పేరు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో చేసిన పవర్ ఫుల్ రోల్ ఇప్పటికీ ఎవరి మర్చిపోలేరు.
ఇక బాహుబలి సినిమాలో పోషించిన శివగామి పాత్ర రమ్యకృష్ణ కెరీర్ లో ది బెస్ట్ అని సినీ ప్రముఖులందరూ ప్రశంసించారు. ఇలాంటి పాత్ర మళ్ళీ రమ్యకృష్ణ కి దొరకడం కూడా కష్టమే అని చెప్పుకున్నారు. కాని రమ్యకృష్ణ భర్త క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ లో ఇలాంటి రోల్ లో కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది.
కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాతో పాటు రొమాంటిక్ అన్న సినిమాలో కూడా నటిస్తోంది. ఇక తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రస్థానం’ దేవాకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా… పవర్ ఫుల్ రోల్ కోసం రమ్యకృష్ణ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో మెగాస్టార్ సలహా కూడా ఉందని చెప్పుకుంటున్నారు. కథ విన్న మెగాస్టార్ ఆ పాత్ర ని రమ్యకృష్ణ తో చేయిస్తే బావుంటుందని సలహా ఇచ్చారట.