త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అన్న టైటిల్ ని అనుకుంటున్నారట మేకర్స్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తవగానే త్రివిక్రమ్ తో సెట్స్ మీదకి వెళ్ళనున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ రివీలైంది. ఈ సినిమాలో ఉన్న కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణ ని తీసుకోవాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో పాత్రలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక పాత్ర ఉందట. ఆ పాత్ర కేవలం రమ్యకృష్ణ మాత్రమే చేయగలదని భావిస్తున్నారట.
సీనియర్ నటీ నటులను తిరిగి తన సినిమాలలో నటింప చేయడం వారి కోసం అద్భుతమైన పాత్రలను క్రియోట్ చేయడం లో త్రివిక్రమ్ దిట్ట. అందుకు ఉదాహరణ ‘అత్తారింటికి దారేది’ ‘అ ఆ’ సినిమాలలో నదియా.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహ.. ‘అజ్ఞాతవాసి’ మూవీలో సీనియర్ నటి ఖుష్బూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో దేవయాని.. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో టబు అని చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ 30 కి అదే ఫాలో అవుతున్నాడని సమాచారం. ఇక గతంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమాలో ఐటెం సాంగ్.. ‘నా అల్లుడు’ సినిమాలో అత్త క్యారక్టర్ లో నటించింది రమ్యకృష్ణ.