దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కలిసి నటించిన ‘బాహుబలి’ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇద్దరి మధ్య మాహిష్మతి సింహాసనం కోసం జరిగిన ఆధిపత్య పోరు రాజమౌళి తెరకెక్కించిన విధానం ఒక్క తెలుగు ప్రేక్షకులనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తో పాటు ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ మరియు రానాల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అన్నట్టుగా కొన్ని చోట్ల ఉండగా మరికొన్ని చోట్ల ఆకట్టుకునే విధంగా రాజమౌళి అద్భుతంగా చూపించడం జరిగింది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా లో రానా ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం రానా రెండు నిమిషాల క్యారెక్టర్ సినిమాలో చేయబోతున్నట్లు సమాచారం. మొదటిలో ఈ పాత్రకోసం గోపీచంద్ ని సినిమా యూనిట్ తీసుకోవాలని భావించిన తరువాత క్యారెక్టర్ గురించి చెప్పడంతో …దీనికి రానా అయితే కరెక్ట్ గా సరిపోతాడు అని డైరెక్టర్ కి ప్రభాస్ తెలిపారట.
దీంతో రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో రానా నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. కాగా లాక్ డౌన్ తర్వాత మళ్లీ ప్రారంభం కాబోయే షూటింగ్ జూలై సెకండ్ వారం రామోజీ ఫిలిం సిటీ లో జరగబోతున్నటు ఫిలింనగర్ లో టాక్. ఈ సినిమాకి ‘రాదే శ్యాం’ అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.