Rana daggubaati: రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’. ఇందులో ఆయన నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటించగా..సీనియర్ హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్ భరతక్కగా కీలక పాత్ర పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎప్పటినుంచో ‘విరాటపర్వం’ సినిమాను రిలీజ్ చేయాలని సురేశ్ బాబు ప్లాన్ చేస్తున్నప్పటికి కరెక్ట్ టైమ్ దొరకడం లేదు.
రిలీజ్ బాగా డిలే అయ్యేసరికి ఈ సినిమా మీద అంచనాలు కూడా ఏమంతగా లేకుండా పోయాయి. దాంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కూడా సురేశ్ బాబు ఒక దశలో డిసైడయ్యారు. అయితే వెంకటేశ్ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం2’ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి సురేశ్ బాబు కాస్త విమర్శలను ఎదుర్కొన్నారు. దాంతో విరాటపర్వం సినిమాను థియేటర్స్లోనే రిలీజ్ చేస్తే మంచిదనే నిర్ణయానికొచ్చారట. అయితే సరిగ్గా లవ్ స్టోరి హిట్ అవడం, పవన్ కళ్యాణ్తో కలిసి రానా ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తుండటంతో ‘విరాటపర్వం’ సినిమాకు ప్లస్ అయ్యాయి.
Rana daggubaati: ‘విరాటపర్వం’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి.
‘లవ్ స్టోరి’ సినిమా మంచి హిట్ సాధించింది కాబట్టి రానా ‘విరాటపర్వ’ సినిమాలో కూడా ఆమే హీరోయిన్ గనక ఆ క్రేజ్ కొంత ఉపయోగపడుతుంది. ఇక ‘భీమ్లా నాయక్’ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది. దాంతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా క్రేజ్ను ఉపయోగించుకొని ‘విరాటపర్వం’ సినిమాను ఆ తర్వాత రిలీజ్ చేసేందుకు ఇప్పుడు కొత్తగా ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఇది వర్కౌట్ అయితే ఖచ్చితంగా ‘విరాటపర్వం’ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.