వేణు శ్రీరాం – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ స్పాట్ కి బోనీ కపూర్ వచ్చి దిల్ రాజు .. పవన్ కళ్యాణ్ .. తో పాటు దర్శకుడిని కలిసి సినిమా గురించి తెలుసుకున్నాడట. వకీల్ సాబ్ మొదలయ్యాక బోనీ రావడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు. శృతి హాసన్ గేస్ట్ అపీరియన్స్ ఇస్తోంది. ఇటీవలే పవర్ స్టార్ బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే వకీల్ సాబ్ ప్రమోషన్స్ వినూత్నంగా మొదలైనట్టే.
అంతేకాదు తర్వాత పవన్ కళ్యాణ్ నటించనబోతున్న మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం సినిమాకి సంబంధించిన పనులు కూడా జోరందుకున్నాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి 25 రోజులు డేట్స్ కేటాయించాడని అంటున్నారు. ఈ 25 రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద చితీకరించాల్సిన సోలో సీన్స్ తో పాటు మిగతా పాత్రలతో ఉన్న కాంబినేషన్ సీన్స్ ని కంప్లీట్ చేసేలా సన్నాహాలు చేసుకున్నాడట.
ఇక ఈ సినిమాని పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటించబోయో రెండు క్యారెక్టర్స్ గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి జంటగా సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. ఇంకా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా వెల్లడించలేదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా నటించే పాత్రలో రానా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
కాగా తాజా ఈ విషయాన్ని రానా వెల్లడించాడు. రీమేక్ లో నటిచమని నన్ను అడిగిన మాట వాస్తవమే. కాని ఇంకా డిసైడవలేదని క్లారిటీ ఇచ్చాడు. మరి మేకర్స్ వెల్లడించాలన్న ఆలోచనతో లా అన్నాడా.. లేక లేక నిజంగా రానాకి ఈ సినిమాలో నటించే ఉద్దేశ్యం లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే రానా ఇలా క్లారిటీ లేకుండా ఇచ్చిన సమాధానానికి పవన్ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చెక్కుతుందట.