దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ సినిమా అరణ్య. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల చేయబోతున్నారు. ప్రభు సాలోమోన్ ఈ సినిమాని తెరకెక్కించగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా ఇప్పుడు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు రానా ధికారకంగా వెల్లడించాడు. అయితే అప్పటి పరిస్థితులని బట్టి రిలీజ్ చేస్తారా లేదా మళ్ళీ వాయిదా వేస్తారా అన్నది చూడాలి.
ఇక రానా ప్రస్తుతం విరాట పర్వం అన్న సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సాయి పల్లవి, ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే దాదాపు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తిరిగి మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిందని తాజా సమాచారం. సురేష్ బాబు సమర్పణలో సురాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం ఈ నెలలో పూర్తి చేసి 2021 జనవరి నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయో హిరణ్య కశిప సినిమాని మొదలు పెట్టడానికి రానా సిద్దమవుతున్నాడని సమాచారం.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లాక్ డౌన్ కి ముందే జరిగింది. అయితే కరోనా కారణంగా దాదాపు 120 కోట్ల తో నిర్మించాలని ప్లాన్ చేసిన సురేష్ బాబు ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. కాగా ఇప్పుడు కాస్త పరిస్థితులన్ని నార్మల్ అయి ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలన్ని సెట్స్ మీదకి వచ్చాయి. దాంతో మళ్ళీ హిరణ్య కశిప ని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారట. గుణ శేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో ఇవ్వబోతున్నారని సమాచారం.