Rape: సాధారణంగా మహిళపై సామూహిక అత్యాచారం జరుగుతుంది.రేపిస్టులు కరుడుగట్టిన నేరస్థులైతే అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ కి కూడా పాల్పడటం తరచూ జరుగుతున్నదే.కానీ ఇందుకు భిన్నంగా పురుషుడి పైనే సామూహిక అత్యాచారం చేసిన కొందరు దాన్ని వీడియో తీసి అది బయటకు రాకుండా ఉండాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడిన సంఘటన నోయిడాలో జరిగింది.అయితే బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఆ దుండగులను పట్టించాడు.
అసలేం జరిగిందంటే!
బాధితుడు ఒక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్.ఒక డేటింగ్ యాప్ ద్వారా అతడికి గౌతమ్ అనే యువకుడు పరిచయమయ్యాడు.ఈ మధ్య ఒకరోజు పార్టీకి రమ్మని బాధితుడిని గౌతమ్ తన గదికి పిలిచాడు.బాధితుడు అక్కడికి వెళ్లే సరికి మరో ముగ్గురు గౌతమ్ స్నేహితులున్నారు.ఈ నలుగురు కలిసి బాధితుడి మీద అత్యాచారానికి పాల్పడ్డారు.ఆ దారుణాన్ని వీడియో తీశారు. అంతేగాక అతన్ని బెదిరించి ఐదువేల రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు.తదుపరి తాము తీసిన అత్యాచారం వీడియోని అతడికి చూపి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే దాన్ని బయట పెడతామని బెదిరించారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు!
దీంతో బెదిరిపోయిన ఆ బాధితుడు గ్రేటర్ నోయిడా పోలీసులను ఆశ్రయించాడు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో గౌతమ్, గౌరవ్,సచిన్ ,మోహిత్ లనే నలుగురిని అరెస్టు చేశారు.వీరిలో గౌతమ్, గౌరవ్ లు అన్నదమ్ములు.పోలీసులు వారి సెల్ఫోన్లను కూడా స్వాధీనపర్చుకుని పరిశీలించగా అవి అత్యాధునికమైనవని వీడియో ను క్వాలిటీగా తీయగలవని తేలింది.
ఈ ముఠా నేర చరిత పెద్దదే!
కాగా ఈ నలుగురు నేరచరిత చాలా పెద్దదని గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ రంజిత్ సింగ్ తెలిపారు.వారి సెల్ ఫోన్ లను స్వాధీనపర్చుకొని పరిశీలించగా ఇలాంటి వీడియోలు పది పన్నెండు ఉన్నాయని ఆయన చెప్పారు.దీన్నిబట్టి ఈ ముఠాకు ఇదే పని పోలీసులు నిర్ధారించుకున్నారు.ఇంకా లోతుగా దర్యాప్తు జరపగా నిందితుల్లో ఒకడైన సచిన్ మూడేళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్ ఒకర్ని ఈ విధంగానే బ్లాక్మెయిల్ చేసి దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేశాడని,ఆ కేసులో అరెస్ట్ అయ్యాడని కూడా వెల్లడైంది.ఈ నేపధ్యంలో నోయిడా పోలీసులు ఈ ముఠా కార్యకలాపాల మీద అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు.