ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటి 17 లక్షల 40 వేలకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కరోనా మృతుల సంఖ్య 5.40 లక్షలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు 67.36 లక్షల మంది కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 44.63 లక్షలుగా ఉన్నాయి.
భారత్ లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 7లక్షలు దాటింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 7,20,012కి చేరింది. కరోనా మరణాలు 20 వేలు దాటి.. మొత్తంగా 20,163 మంది మృతి చెందారు. ఒక్క ఢిల్లీలోనే 1లక్ష కేసులు దాటిపోయాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1,00,823కు చేరుకుంది. గడచిన 24గంటల్లో 1379 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో నిన్న 1,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 25,773కి చేరింది. ఇప్పటివరకూ కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,781గా ఉంది. రాష్ట్రంలోలో కరోనా మృతుల సంఖ్య 306కి చేరుకుంది. మొత్తంగా తెలంగాణలో 25వేలు కేసులు దాటిపోయాయి.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 20,019కి చేరాయి. తొలి 10వేల కేసులు నమోదు కావడానికి దాదాపు 95 రోజులు పడితే తర్వాతి 10వేల కేసులు కేవలం 12 రోజులే పట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నూలు, గుంటూరు, అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోనే 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకలిగిస్తోంది.