Rashmika Mandana: టాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక ప్రాజెక్టులలో హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్న వారి లో ముందు వరుసలో ఉండే రష్మిక మందన. “చలో” సినిమా తో మొట్టమొదటి హిట్ అందుకున్న రష్మిక మందన తర్వాత “గీత గోవిందం” సినిమా తో అదరగొట్టే యాక్టింగ్ తో… సత్తాచాటిన రష్మిక మందన.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. 2020 వ సంవత్సరంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో బంపర్ హిట్ అందుకున్న రష్మిక మందన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న “పుష్ప” లో హీరోయిన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
గిరిజన పాత్రలో నటిస్తున్న రష్మిక మందన క్యారెక్టర్ సినిమాకు హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరో మెగా హీరో సరసన రష్మిక మందన నటించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లో రష్మిక మందన నీ హీరోయిన్ గా తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Pushpa : పుష్ప తర్వాత బన్ని ఫిక్సైందా ఆ డైరెక్టర్కేనా..?
ఇప్పటికే స్టోరీ విన్నట్లు ఆమె ఓకే అన్నట్లు ఫిలిం సిటీలో న్యూస్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ కి నిర్మాత దిల్ రాజు రిఫర్ చేసినట్లు ఆయన.. ఓకే అన్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని కంఫర్మ్ చేయడం తెలిసిందే. ఇదే రీతిలో హీరోయిన్ విషయంలో కూడా రష్మిక ని ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.