టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న అందరికీ లక్కి హీరోయిన్ గా మారుతుంది. 2020 ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ సినిమాలతోను మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలు మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించడంతో ఇక టాలీవుడ్ లో రష్మిక కి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
దాంతో సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతుండటం తో రష్మిక పేరు సౌత్ మొత్తం మార్మోగిపోతుంది. ఈ క్రమంలో మరో భారీ ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ నిర్మించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ని ముందు హీరోయిన్ గా అనుకున్నారు.
సరిగ్గా సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సమయంలో కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. ఈ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే సాయి మంజ్రేకర్ స్థానంలో రష్మిక మందన్న ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాక్సర్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమా షూటింగ్ ను త్వరలో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అందుకే ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ ని ఫైనల్ చేసి త్వరలో అధికారకంగా వెల్లడించనున్నారని సమాచారం. మొత్తానికి రష్మిక తన క్రేజ్ తో బాలీవుడ్ హీరోయిన్స్ కే చెక్ పెడుతోంది.