ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. వరుసగా రష్మిక మందన్న నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. చెప్పాలంటే టాలీవుడ్ లో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీకొచ్చిన అతి తక్కువ కాలంలోనే యంగ్ స్టార్ హీరోలతో జోడీ కట్టి నటించిన ప్రతి సినిమాతో హిట్ ను సాధించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. తన అందచందాలతో హావభావాలతో కన్నడ నటి అయినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఈ బ్యూటీ ఇచ్చే క్యూటీ ఎక్స్ప్రెషన్స్ కోసం పడి చచ్చే వారు ఉన్నారంటే అమ్మడికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపుమీదున్న రష్మిక.. తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు నాటి క్యూట్ గర్ల్ గా నటించిన రష్మిక ఇప్పుడు చిత్తూరు యాసలో మాసీగా అదరగొట్టెందుకు సిద్ధమవుతోంది.
ఓవైపు ఈ మూవీని చేస్తూనే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది రష్మిక. వరుస సక్సెస్ లతో సత్తా చాటుతున్న రష్మిక టాలీవుడ్, శాండిల్ వుడ్ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ యుంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోందట. బాలీవుడ్ కు చెందిన కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి ఇన్నాళ్ళకి రష్మిక బాలీవుడ్ ఎంట్రీ జరగడం గొప్ప విషయం. అంతేకాదు గత కొంతకాలంగా బాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోవాలన్న రష్మిక మందన్న కల నెరవేరబోతోంది.