రష్మిక మందన్న… అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. గీత గోవిందం సినిమా ఒక్కటే రష్మికను ఎక్కడికో తీసుకుపోయింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ రేంజ్ కు ఎదిగింది. ఇప్పుడు రష్మికకు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. తన కోసం పెద్ద పెద్ద హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
స్టార్ డైరెక్టర్లంతా తననే వాళ్ల సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని యోచిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రష్మిక పూర్తిగా తన ఫిట్ నెస్ మీదనే దృష్టి పెట్టింది. గత ఆరు నెలల నుంచి షూటింగ్ లు లేకపోవడంతో పూర్తిగా ఫిట్ నెస్ ను సాధించి.. ఇప్పుడిప్పుడే షూటింగ్ ల కోసం రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి రష్మిక ఓ వీడియోను పోస్ట్ చేసింది. నా జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలను నా అభిమానుల అండదండలతో దాటుతున్నా. అభిమానునలే నా బలం. ఈ లాక్ డౌన్ సమయంలో నా అభిమానులతో టచ్ లో ఉన్నా. వాళ్లతోనే ఎక్కువగా గడిపా.. వాళ్లే నా బలం.. వాళ్లే లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. అంటూ రష్మిక భావోద్వేగానికి గురయింది.
ఇక.. రష్మిక ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో నటిస్తోంది. దానితో పాటు.. తమిళంలో కార్తీ సరసన.. సుల్తాన్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!