కన్నడ లో కిరాక్ పార్టీ సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది రష్మిక మందన్న.. తెలుగులో చలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో వరస హిట్లు సొంతం చేసుకుంది.. టాప్ హీరోలతో నటించడంతో మంచి రెమ్యూనిరేషన్ కూడా తీసుకుంటుంది.. ఈ టాలెంటెడ్ హీరోయిన్ తన ఇన్స్టాగ్రామ్ లో 10 మిలియన్లకు పైగా ఫాల్లోయర్స్ ను సంపాదించుకుంది.. తాజాగా అమ్మడు లగ్జరీ కారు రేంజ్ రోవర్ ను కొనుగోలు చేసింది.. ఈ విషయాన్ని తెలుపుతూ, ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఎంచుకుంది.. అంతేకాకుండా ఐ లవ్వూ.. ఇది మీ కోసమే అని స్వీట్ గా చేసింది..
కొంతకాలం క్రితం కారు కొనే స్థాయికి వస్తాను అని నెనేప్పుడు అనుకోలేదు.. ఇలాంటి విషయాలను సాధారణంగా నాలోనే ఉంచుకుంటాను. ఈసారి మాత్రం ఫ్యాన్స్ తో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రయాణంలో మీరు భాగమయ్యారు కాబట్టి.. ఈ విషయం మీకు తెలియాలి. ఈ ప్రయాణంలో భాగమైనందుకు, మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇది మీ కోసం అని రష్మిక ట్వీట్ తో తెలిపింది.
ఇదిలాఉండగా ఈ రేంజ్ రోవర్ లగ్జరీ కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భారతదేశంలో ఈ కార్ ధర కోటి రూపాయలు పైనే ఉంటుందని చిత్ర యూనిట్ గుసగుసలాడుతుంది. ప్రస్తుతం రష్మిక బన్నీ తో పుష్ప, ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తోంది. ఇంకా మిషన్ మజ్ను లో హీరోయిన్ గా ఎంపికైంది ఈ కన్నడ భామ.