Rashmika mandanna : రష్మిక మందన్న ఇప్పుడు సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా అంటే రష్మికనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అమ్మడికి తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో భారీగా క్రేజ్ ఉంది. అందుకే మేకర్స్ తన డేట్స్ కోసం తెగ పోటీ పడుతున్నారు. తెలుగులో 5 భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది.
ఇక బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది రష్మిక. కోలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కార్తీతో నటించిన సుల్తాన్ తో అక్కడ క్రేజీ హీరోయిన్గా మారింది. అయితే ఈమె ఎన్ని సినిమాలు చేస్తున్నా నా మొదటి ప్రాధాన్యం పుష్ప సినిమాకే అంటోంది. ఈ సినిమా బాహూలి మాదిరిగా రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు 200 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ అండ్ ముత్యం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలున్నాయి.
Rashmika mandanna : పుష్ప సినిమాకే తన ఫస్ట్ ఇంపార్టెన్స్.
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషాలలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే రష్మిక క్రేజ్ 5 భాషలలో ఊహించని విధంగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమెకి వచ్చే అవకాశాలు ఏ రేంజ్ లో ఉంటాయో కూడా చెప్పడం కష్టం. అందుకే రష్మిక ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుందట. అందుకే పుష్ప సినిమాకే తన ఫస్ట్ ఇంపార్టెన్స్ అని చెబుతోంది. ఇక ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఒక పార్ట్ ఈ ఏడాది రిలీజ్ చేయబోతుండగా మరొక పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?