ఒకపక్క కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుంటే మన టాలీవుడ్ యంగ్ బ్యూటీస్కి మాత్రం బంపర్ ఆఫర్ వచ్చింది. వీళ్లకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. ఇన్నాళ్లు తెలుగు సినీ పరిశ్రమలో ఇద్దరు కన్నడ ముద్దుగుమ్మలు అడ్డుగా ఉన్నారని బాధపడిన హీరోయిన్లకు ప్రస్తుతానికి ఆ అడ్డంకి త్వరలోనే తొలగిపోనున్నట్లు సమాచారం.
టాలీవుడ్ బ్యూటీ స్వీటీ (అనుష్క) ఇప్పటికే సీనియర్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయింది. సమంత మరియు కాజల్ పెళ్లిళ్లు చేసుకొని మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో డైరెక్టర్లు కమర్షియల్ హీరోయిన్ రోల్స్కి పూజా హెగ్డే మరియు రష్మిక మందన్న ను సంప్రదిస్తున్నారు. వారికి ఈ ఇద్దరు కన్నడ ముద్దుగుమ్మలు ఫస్ట్ ఛాయిస్ అయిపోయారు. టాలీవుడ్ లో మహేష్ బాబు, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ అందరూ ఈ హీరోయిన్లతోనే సినిమాలు చెయ్యడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళకి బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్సులు వచ్చాయి. కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళు టాలీవుడ్ని పక్కనపెట్టి పెట్టనున్నారు.
అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే. అయితే ఈ హీరోయిన్ బాలీవుడ్లో వరుస సినిమాలకి సైన్ చేస్తోంది. సల్మాన్ ఖాన్తో ‘ఖబీ ఈద్ ఖబీ దివాళి’ మరియు రణ్వీర్ సింగ్తో ‘సర్కస్’, సినిమాలలో కనిపించి బాలీవుడ్ లో త్వరలోనే సందడి చేయనున్నది పూజా హెగ్డే. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు సినిమాలకి దూరమవుతోంది.
ఇక పూజా తరువాత రష్మిక కూడా ఇదే బాటలో నడుస్తూ మేకర్స్కి మరియు హీరోలకి ఈమె కూడా షాక్ ఇచ్చింది. సిద్దార్థ్ మళ్హోత్రా తదుపరి చిత్రం ‘మిషన్ మజ్ను’ సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో నటించనున్నది.
పూజా హెగ్డే, రష్మిక తర్వాత టాలీవుడ్ లో నెక్స్ట్ పోసిషన్ లో ఉన్నదీ కీర్తి సురేశ్. ‘మహానటి’ సినిమాతో ఆమె నటనకుగాను నేషనల్ అవార్డ్ అందుకున్నది కీర్తి సురేష్. ఎప్పటి నుంచో టాలీవుడ్ లో టాప్ లోనే కొనసాగుతున్న సమంత కు సైతం బాలీవుడ్ లో రాని ఆఫర్ ఇప్పుడు ఈ ఇద్దరు కన్నడ బ్యూటీస్ కి వచ్చింది. మరి ఈ ఇద్దరు బాలీవుడ్ లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.