Rashmika mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హింది, తమిళ సినిమా ఇండస్ట్రీలలో క్రేజీ హీరోయిన్. వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలు చేస్తోంది. రష్మిక మందన్న నాగ శౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరసగా అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్కి వచ్చిన కొద్ది రోజుల్లోలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాతో 5 భాషల్లో ఆగస్ట్ 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఇక ఇటీవలే బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ అక్కడ రెండు సినిమాలు చేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్ర కి జంటగా ‘మిషన్ మజ్ను’ అన్న సినిమాలో రష్మిక మందన్న నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తండ్రీ – కూతురు మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలబోతోంది. బిగ్ బి తో నటించడం రష్మిక కల. ఆ కల ఇంత త్వరగా నెరవేరబోతుండటం గొప్ప విషయం.
Rashmika mandanna : రష్మిక మందన్న బురదలోకి దిగి పొలం దున్నుతోంది.
అలాగే తమిళంలో కార్తి సరసన ఒక సినిమా చేస్తోంది రష్మిక. సుల్తాన్ అన్న టైటిల్తో ఈ సినిమా రూపొందుతుండగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ షూటింగ్లో పాల్గొన్న వీడియోని రష్మిక తన ఇన్స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో రష్మిక పొలం దున్నుతున్నట్లు కనిపిస్తుంది. దుక్కిదున్నే యంత్రంతో రష్మిక బురదలోకి దిగి పొలం దున్నుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సొషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.