కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. సినీ తారలు, ఆర్టిస్టులు, ప్రొడక్షన్ టీమ్ లే కాదు నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సంక్షోభం నుంచి కోలుకోవాలంటే కోత విధించాలని నిర్ణయించుకున్నారు. స్టార్స్ రెమ్యునరేషన్ లో 20 శాతం తగ్గించాలని నిర్మాతల గిల్డ్ ప్రతిపాదనకు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. వీరి మాట ఎవరూ పట్టించుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ రష్మిక మందన్న రెమ్యునరేషన్ తగ్గించేది లేదంటూ తెగేసి చెబుతోందట. కన్నడ క్యూటీ ఛలో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది.
గీత గోవిందం సినిమా తో మంచి క్రేజ్ ను సాధించిన రష్మిక ఆ తర్వాత నుంచి తన రెమ్యునరేషన్ పెంచేసింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడంతో… అమ్మడి రేటు పెరుగుతూనే ఉంది. ఇదే విషయంపై అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో రష్మిక, నటిగా తన ఎదుగుదల లో పారితోషికం కూడా ఒక భాగమే అని చెప్పుకొచ్చింది. అలాంటి అమ్మడు ఇప్పుడు రేట్ తగ్గించమంటే తగ్గిస్తుందా నో అని తెగేసి చెబుతోందట. హీరోలకు ఒక రూల్ హీరోయిన్లకు ఒక రూలా అంటూ క్వశ్చన్ చేస్తోందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతానికి మెయిల్ స్టార్ ఎవరు రెమ్యునరేషన్ తగ్గించడం లేదని అలాంటప్పుడు మేమేందుకు తగ్గించాలంటూ తెగేసి చెబుతోందని ఇండస్ట్రీ లో టాక్.
ఈ క్యూటీ ఇలా చెప్పడంలో తప్పేమీ లేదంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ఏడు రిలీజ్ అయిన భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇందులో కథానాయికగా నటించిన రష్మిక అందరిని మెప్పించింది. వరుసగా హిట్లు చేతిలో ఉండటంతో దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడి రేంజ్ కి తగ్గట్టుగానే చెల్లిస్తున్నారు. ఇండస్ట్రీ లో లక్కీ గర్ల్ గా రుజువు చేసుకున్న రష్మిక ఇలా చెప్పడంలో తప్పేమీ లేదంటూ ఒక వర్గం భావిస్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
శర్వానంద్ తో కలిసి ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇందులోనూ భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని అఖిల్ సరసన మరో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది ఈ కన్నడ కుట్టి ఇందులోనూ భారీగానే డిమాండ్ చేస్తోందని ఇండస్ట్రీ టాక్. రష్మిక అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోలకు ఒక రులే హీరోయిన్లకు ఒక రులా అన్న ప్రశ్న ప్రస్తుతం వైరల్ అవుతోంది.