గోపిచంద్ మలినేని – మాస్ మహారాజ రవి తేజ ది హిట్ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ ముందే చాలా వరకు షూటింగ్ కంప్లీటయింది. ఇక బ్యాలెన్స్ షూటింగ్ కోసం తిరిగి షూటింగ్ మొదలైంది. అనుకున్నట్టుగానే టాకీ పార్ట్ మొత్తం కంప్లీటయిందట. గత నెలలోనే ఈ సినిమాలో నటిస్తున్న వరలక్ష్మీ క్యారెక్టర్ కి సంబంధించిన షూట్ కూడా ఫినిష్ చేసి పంపేశారు.
అంతేకాదు తాజాగా చిత్ర బృందం మాత్రం కేవలం ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సినిమాకి 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్స్ వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఈ హ్యాట్రిక్ సినిమా మీద అందరికీ భారీగానే అంచనాలున్నాయి.
రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్నాడు. ‘ఖిలాడి’ అన్న టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బుల్లితెర యాంకర్, నటి అనసూయ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని. ఈ సినిమాతో పాటు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో నటించబోతున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమా కథ గతంలో మెగాస్టార్ నటించిన చంటబ్బాయ్ సినిమా ని పోలి ఉంటుందని వార్తలు వచ్చాయి.
రవితేజ నటించిన ‘డిస్కో రాజ’ ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. వరసగా ఫ్లాప్స్ వస్తున్న రవితేజ ‘డిస్కో రాజ’ మీద మాత్రం చాలా నమ్మకాలు పెట్టుకున్నప్పటికి మళ్ళీ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది.అందుకే ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని తో క్రాక్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో మళ్ళీ రవితేజ ట్రాక్ ఎక్కుతాడని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?