తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొన్ని రోజులుగా వార్తలు నిలుస్తూ వస్తోన్న విషయం తెల్సిందే. అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టై నిన్న బెయిల్ పై విడుదలైన సంగతి తెల్సిందే. అయితే రాత్రి ర్యాలీగా వస్తోన్న ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో వారిని దుర్భాషలాడడంతో ఆయనపై సెక్షన్ 353, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెల్సిందే.
ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన జేసీ, అవసరమైతే వైసీపీలో చేరతానని లేదంటే పూర్తిగా రాజకీయాలకు దూరమవ్వడానికైనా సిద్ధమే అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంటే పై రెండిట్లో దేనికైనా తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.