వాటిని తెలుసుకోవాలి అంటే ముందుగా “యాంటిజెన్”, “యాంటీబాడీ”ల గురించి తెలుసుకోవాల్సిందే.
టెర్రరిస్టులు మన దేశంలోకి ప్రవేశించినపుడు ఆర్మీ, పోలీసులు వాళ్ళని చంపడానికి ఎలా ప్రయత్నిస్తారో, వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించినపుడు మన శరీరంలో కూడా వాటిని చంపడానికి రక్షక వ్యవస్థ (ఇమ్మునో గ్లోబులిన్స్) ఉంటుంది.
ఇక్కడ టెర్రరిస్టులు/వైరస్ ని “యాంటీజెన్” అనుకుంటే పోలీసులు/ఇమ్మూనో గ్లోబ్యులిన్స్ ని యాంటీబాడీస్ అనుకోవాలి. ఇక్కడ రెండు పక్షాల మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
ఇక టెస్టుల విషయానికి వస్తే… కరోనాని నిర్ధారించడానికి ప్రస్తుతం మన దగ్గర 3 రకాల పరీక్షలు చేస్తున్నారు.
1.RT-PCR : దీని ద్వారా మన శరీరంలో వైరస్ RNA జీనోమ్ (యాంటీజెన్) కనిపెడతారు. ఇది అత్యంత నమ్మదగిన, ఖచ్చితమైన పరీక్ష. ఇది ఒక్క వైరస్ అణువును కూడా తొలి దశలోనే గుర్తించ గలదు.
2. TrueNat/CBNAAT : ఇవి కూడా వైరల్ జీన్స్ ని కని పెట్టడానికి వాడతారు. కాకుంటే ఇది పరిమాణ పరీక్షలు మాత్రమే. ధర కూడా తక్కువ. తీసుకున్న నమూనా సరిగ్గా లేకుంటే ఇవి వైరస్ ను గుర్తించలేవు. RTPCR కంటే ఫలితాలు వేగంగా ఇవ్వగలిగినా ఖచ్చితత్వం ఉండదు.
అయితే…శాంపిల్ సేకరణ లో ఖచ్చితత్వం, ఈ పరీక్షలకు వాడే కిట్స్ యొక్క సున్నితత్వం, సిబ్బంది శిక్షణా సామర్ధ్యం వంటి అంశాల మీద ఈ పరీక్షల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న ఫలితాలు కొంచెం సందేహం కలిగిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం 11 చోట్ల RTPCR, 47 చోట్ల TrueNat పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తూ ఉండగా, తెలంగాణలో ప్రభుత్వం కేవలం 10 చోట్ల మాత్రమే RTPCR, నాలుగు చోట్ల CBNAAT పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తూ ఉంది. తెలంగాణలో తక్కువ పరీక్షలకు ఇదొక కారణం.
ఇక రాపిడ్ టెస్టింగ్ కిట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవి “యాంటీ బాడీస్” ని కనిపెట్టి రోగ నిర్ధారణకు ఉపయోగపడతాయి. ఖచ్చితత్వం చాలా తక్కువ. వైరస్ మన బాడీలో ప్రవేశించాక 5 రోజులకు కానీ యాంటీ బాడీస్ తయారు అవవు. అందుకే ఇవి అంత ఉపయోగకరం కాదు.
(పైన ఇచ్చిన సమాచారం మొత్తం డా. ఏవీఎస్ రెడ్డి ఎంబీబిఎస్ డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్, ట్విట్టర్ అకౌంట్ నుండి సేకరించి పొందుపరచినది.)