TTD: శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ ధర చూసి ఖంగు తినవద్దు. ఈ ధరను స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) ప్రకటించింది. సాధారణ రోజుల్లో అయితే కోటి మాత్రమే అట. ఈ శుక్రవారం నాడు టికెట్ ధర రూ.1.50 కోట్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే మనకి ఆ ధర ఎక్కువ కావొచ్చేమో గాని ఆ టికెట్లు కోసం కొంతమంది మహానుభావులు తెగ పోటీ పడతారు. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
TTD: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పోలీసులు..! 107 మందిపై కేసులు నమోదు..!!
ఈ సంప్రదాయం ఎప్పటినుండి వస్తోంది?
అది ఎప్పటినుండి వస్తుందో మనకు తెలియదు గానీ… దీన్ని 2006లో TTD రద్దు చేసింది. 2006 వరకు కేటాయించి మిగిలిపోయిన 531 టికెట్లను ఇపుడు భక్తులకు కేటాయించాలని నిర్ణయించింది. ఇకపోతే వీటి ద్వారా వచ్చిన డబ్బులతో తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే కార్యక్రమం TTD చేప్పట్టబోతోంది. సాధారణంగా ఈ టికెట్లు కలిగిన భక్తులు ఏడాదిలో ఒక్కరోజు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
TTD: తిరుమల కొండ మీద వసతి దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ఫోన్ తో వసతి పొందేవకాశం వినియోగించుకొండి !!
గతంలో వీటి ధరలు ఎలా వున్నాయి?
గతంలోగాని మనం చూసుకుంటే, ఈ టికెట్ ధర రూ. లక్ష వరకు ఉండేది. ఇక శుక్రవారం రోజు మాత్రం రూ. 5 లక్షలకు విక్రయించేవారు. ఈ క్రమంలో ఈ సేవా టికెట్లు పొందిన భక్తుల సంఖ్యకు పోటీ ఏర్పడటంతో 2006 నుంచి విక్రయాలను నిలిపివేశారు. తాజాగా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన ధర్మకర్తల మండలి వాటి ధరను రూ. కోటిగా నిర్ణయించింది. అలాగే శుక్రవారం నాడు రూ.1.50 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఇక ఈ టికెట్ల కేటాయింపులో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ను కూడా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. టికెట్లు కావలసినవారు తిరుమల దేవస్థానం యొక్క అధికారిక వెబ్ సైట్ ను చూడగలరు.