కొద్దిరోజులుగా దేశంలో బంగారం ధర పైపైకి ఎగబాకుతోంది. అత్యధికంగా రూ.57 వేల వరకూ బంగారం ధర పెరిగిపోయింది. ప్రస్తుతం అందరూ స్టాక్ మార్కెట్లకు బయపడి బంగారంపై పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం ఒక కారణమైతే.. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆర్ధిక స్థితి కొనసాగుతుందన్న అనుమానంతో ప్రభుత్వం కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మరో కారణం. ఈ అనుమానాలు, భయాలే బంగారం ధర ఆస్థాయిలో పెరగడానికి కారణమైంది. 2008-09 సమయంలో ఆర్ధిక సంక్షోభం ఎదురైనప్పుడు ఒక ఔన్సు 1830 డాలర్ల వరకూ అంతర్జాతీయ మార్కెట్ లో ట్రేడ్ అయింది. ఆ తర్వాత 1400 వరకూ తగ్గింది. ప్రస్తుతం ఒక ఔన్సు 2040-2050 మధ్య ట్రేడ్ అవుతోంది.
ఇది ఎంత పెరిగినా 2120 వరకూ వెళ్లే అవకాశం ఉంది. దీంతో బంగారం ధర 64 నుంచి 65 వరకూ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ధర కేవలం కరోనా భయంతో తప్ప డిమాండ్ తో పెరిగింది కాదనేది సుష్ఫష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ దేశమైనా తన వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మితే అప్పుడు బంగారం ధర పడిపోతుంది. అదే జరిగితే మళ్లీ బంగారం 38వేల దగ్గరకి తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికైతే సామాన్యులు బంగారం కొనే అవకాశం లేకపోయింది. ఉన్న డబ్బును ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలనే ఎవరైనా ఆలోచించేది. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనకపోవడమే మంచిదని కూడా సూచిస్తున్నారు.
గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కొంత బెటర్ అని సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే తప్ప అప్పులు చేసి బంగారం కొనుగోలు, పాత్ ఆర్నమెంట్స్ ను మార్చి కొత్తవి కొనుగోలు చేయడం ఏమంత మంచిది కాదని సూచిస్తున్నారు. అమెరికా వంటి దేశాలు తమ ఆర్ధిక సామర్ధ్యం చూపేందుకు బంగారం ధరలు పెంచుకుంటూ వెళ్తారు కాబట్టి.. వారి మాయలో పడకుండా మనం జాగ్రత్త పడాలని అంటున్నారు.