Children: సైకాలజిస్టులు
కరోనా వైరస్ కారణంగా పెద్దలు మాత్రమే కాదు పిల్లల్లో కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. శారీరక సమస్యల తో పాటు మానసిక సమస్యలు కూడా పిల్లల్లో పెరిగాయి అని సైకాలజిస్టులు అంటున్నారు.ఈ మానసిక సమస్యలు పిల్లల్లో సెకండ్ వేవ్ నుండి ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా మానసిక నిపుణులుతెలియచేస్తున్నారు.
పిల్లల్లో వచ్చిన మార్పులు ఎలాంటివి అనేది మానసిక నిపుణులు వివరిస్తున్నారు. కారోనా సెకండ్ వేవ్ టైం లో సోషల్ ఇంటరాక్షన్ బాగా తగ్గింది. ప్రదానం గా తల్లిదండ్రులకు , పిల్లలకు మధ్య కూడా ఎక్కువ ఇంటరాక్షన్ జరగలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహము లేదు. పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం తో , పిల్లలు వాళ్ళ పనిలోవారు ఉండడం వలన వారి మధ్య చాలా తక్కువ మాటలు ఉండేవి. ఈ కారణంగా వాళ్ళల్లో కొన్ని మానసిక సమస్యలు వచ్చినట్లు కనుగొన్నారు.
Children: చిన్న చిన్నగా మాట్లాడడం
2-3 సంవత్సరాలు ఉన్న పిల్లలు చిన్న చిన్నగా మాట్లాడడం మొదలు పెడతారు. కానీ మాటలు పిల్లల్లో ఇంకారాకుండా ఆలస్యంగా వస్తున్నాయి అని మానసిక నిపుణులు తెలియచేస్తున్నారు. అదే విధంగా పిల్లలు చేసే కొన్ని కార్యక్రమాలలో కూడా అభివృద్ధి కొంత ఆలస్యంగా ఉన్నట్లు నిపుణులు గమనించారు.
పిల్లలు టాయిలెట్ కి వెళ్తాము అని చెప్పడానికి వాటికీ సంబందించిన విషయాలలో కూడా వారు తగినంత మార్పు రాలేదని తెలియచేస్తున్నారు.ఇప్పటికే టాయిలెట్ ట్రైనింగ్ గురించి పూర్తిగా తెలిసి ఉండవలిసిన పిల్లలు ఇంకా పక్క తడపడం లో నే ఉన్నట్టు మానసిక నిపుణులుతెలుసుకున్నారు. అదే విధంగా ఎవరయినా తెలియని వ్యక్తులని చూసినప్పుడు ఎంగ్జైటీ, సోషల్ ఫోబియా లాంటివి ఉన్నట్టు గుర్తించారు.
ఎంత బిజీ గా ఉన్న
ట్రీట్మెంట్ కోసం మానసిక నిపుణుల వద్దకు వస్తున్నవారిలో ఎక్కువ భయం దాగి ఉన్నట్టు తెలుసుకోగలిగారు. ఈ సమస్యలు అన్ని ఎక్కువగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చాయి అని మానసిక నిపుణులు తెలియచేస్తున్నారు. మీరు ఎంత బిజీ గా ఉన్న పిల్లల కోసం సమయాన్ని గడపపోతే మాత్రం పిల్లల్లో ఇలాంటి సమస్యలు తప్పవని.. తగినంత శ్రద్ధ చూపమని కోరుతున్నారు.