కరోనా భూతం రోజులు గడుస్తున్నా ఎక్కడా తగ్గడంలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా కారణంగా రోజుకు వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గకపోగా అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇన్నాళ్లూ ఐదు వేలు, ఆరు వేలు రేంజ్ లో ఉన్న కరోనా పాజిటివ్ సంఖ్య ఒక్క రోజులో 10 వేలకు చేరుకోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. 70,584 సాంపుల్స్ ను పరీక్షించగా 10,000 కేసులు నమోదవడం దారుణం. ప్రస్తుతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 65 మంది కరోనా కారణంగా ఒక్కరోజులో చనిపోయారు. కాగా కొత్తగా 2,784 మంది కరోనా నుండి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి.