రామ్ తాజాగా రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ మాస్ హిట్ తర్వాత ram నుంచి వచ్చిన red సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మన ఎనర్జిటిక్ హీరో ram కూడా red సినిమా ఎప్పుడో రిలీజ్ కి రెడీ అయినా కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం లో వచ్చిన red సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం సినిమాకి రీమేక్ గా రూపొందించారు.
ram డ్యూయల్ రోల్ లో కనిపించాడు. మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. హెబ్బాపటేల్ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ram పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన red సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. కేవలం ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పిస్తుందన్న మాట వినిపిస్తోంది. వాస్తవంగా red సినిమా తో భారీ హిట్ అందుకుంటానని ram భావించాడు. ఇస్మార్ట్ శంకర్ red సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మాస్ హిట్స్ అందుకొని మరికొంత తన మార్కెట్ ని పెంచుకోవాలని ప్లాన్ చేశాడు.
అంతేకాదు ఈ సినిమా తర్వాత కూడా కొన్ని మాస్ క్యారెక్టర్స్ ఉన్న కథలనే ఎంచుకొని పెట్టుకున్నాడట. రెడ్ రిజల్ట్ ని బట్టి వాటిలో ది బెస్ట్ కథ తో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకున్నాడు. కాని ram అనుకున్నట్టుగా రెడ్ రిజల్ట్ రావడం కష్టమన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ram నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడి దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఉండే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఏదేమైనా తమిళ సినిమా మీద ram పెట్టుకున్న ఆశలన్ని కాస్త తారుమారయినట్టే అని చెప్పుకుంటున్నారు.