సాక్షాత్తు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వంద కోట్లకు పైగా నొక్కేయాలని చూసిన వైసిపి చోటా నేత గుట్టు రట్టయ్యింది .ఆఖరి నిమిషంలో సీఎం పేషీ అధికారులు అప్రమత్తం కావడంతో
ఈ డబ్బు ఆ నేత జేబుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగారు.అయినప్పటికి వైసిపికి చెందిన ఒక ద్వితీయ శ్రేణి కార్యకర్త ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణానికి సాహసించడం సంచలనం రేపింది.దీని వెనుక పెద్ద తలకాయలు ఉంటాయని కూడా అనుమానిస్తున్నారు.విషయానికొస్తే ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ నుంచి రూ. 117 కోట్లు కొట్టేయాలనుకున్నది ఎవరో ఏసీబీ, సీఐడీ అధికారులు గుర్తించారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వైసీపీ చోటా నేత భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కావాలంటూ..
కొంత మంది బాధితుల్ని తీసుకెళ్లి తన పలుకుబడిని ఉపయోగించి సాయం వచ్చేలా చేస్తారు. అలా వచ్చిన చెక్కులను తానే తీసుకుంటారు. ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇస్తారు. కానీ ఆ చెక్కులలో నగదు మొత్తాలను పెద్ద అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటాడు . భాస్కర్ రెడ్డి ఇలా చెక్కులను ఫేకింగ్ చేసి. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా బ్రాంచీల్లో క్లియరెన్స్ కోసం వేస్తాడట. ఇలా ఫేక్ చెక్కులను గతంలోనూ అతను డ్రా చేసుకున్నట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.అయితే ఇక్కడే విచారణ అధికారుల అనుమానాలు పలుపలు విధాలుగా పోతున్నాయి. భాస్కర్ రెడ్డి వైసీపీలో ఒక సామాన్య ద్వితీయ శ్రేణి నాయకుడు.ఆయన ఆలోచనా పరిధి వందల కోట్ల వరకూ వెళ్తుందని దర్యాప్తు సంస్థలు కూడా అనుకోవడం లేదు.అసలు భాస్కర్ రెడ్డి చిన్న చేపేనని.
. ఆయన వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.కుంభకోణం కోణం పరిధి విస్తృతం కావడంతో విచారణ అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు . ఏసీబీ అధికారులు సచివాలయంలో.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగుల్ని ప్రశ్నించారు. గత ఏడాదిన్నర కాలంలో పదిహేను వేల మంది కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అందులో పట్టుమని వెయ్యి కూడా లక్ష కు మించి లేవని మిగతావన్నీ లక్షలోపేనని వారు వివరించారు. అదే సమయంలో వివిధ చెక్కులు పెద్ద మొత్తాలలో డ్రా చేసుకున్నట్లు కూడా గుర్తించారు.అలా డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు.పైకి చాలా చిన్నదిగా కనిపిస్తున్న ఈ వ్యవహారం లోతుకెళ్లే కొద్దీ అతి పెద్దదిగా మారుతుండటంతో అన్ని కోణాల నుండి విచారణను ముమ్మరం చేశారు