చైనా కంపెనీ షియోమీ భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను సోమవారం విడుదల చేసింది. రెడ్మీ నోట్ 9 ఇప్పుడు దేశంలో మొబైల్ ప్రియులకు లభిస్తోంది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను ఏర్పాటు చేశారు. 6.53 ఇంచుల డిస్ప్లే ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ను ఇచ్చారు. అలాగే మీడియాటెక్ హీలియో జి85 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండగా, దీనికి సపోర్ట్గా 4, 6జీబీ ర్యామ్ ఆప్షన్లను ఇచ్చారు.
రెడ్మీ నోట్ 9లో.. 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్కు సపోర్ట్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతోపాటు 8, 2, 2 మెగాపిక్సల్ కెపాసిటీలు కలిగిన మరో 3 కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది.
డ్యుయల్ 4జీ సిమ్లకు ఇందులో సపోర్ట్ను ఇచ్చారు. బ్లూటూత్ 5.0 ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. బ్యాటరీ కెపాసిటీ 5020 ఎంఏహెచ్. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
* రెడ్మీ నోట్ 9 స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999
* 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499
* 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999
ఈ ఫోన్ను జూలై 24 నుంచి విక్రయిస్తారు. అమెజాన్, ఎంఐ స్టోర్స్లో కొనవచ్చు.