రెజీనా కసాండ్ర .. టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉండగానే కొన్ని ఫ్లాప్స్ రావడంతో కనిపించకుండా పోయింది. ఆ మధ్య అడవి శేష్ నటించిన ఎవరు సినిమాతో మంచి హిట్ అందుకున్న రెజీనా మళ్ళీ ఫాం లోకి వచ్చిందనుకున్నారు. కాని హీరోయిన్ గా మళ్ళీ తెలుగు సినిమాకి సైన్ చేయలేదని సమాచారం. కాని మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా 2021 సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇది తప్ప మరో తెలుగు సినిమా రెజీనా చేతిలో లేదు.
అయినా చాలా బిజీగా ఉంది. అది కూడా హీరోయిన్ గా. ఎవరైనా మీరు ఒక్క తెలుగు సినిమా కూడా చేయడం లేదని అడిగితే .. సారీ నేను కోలీవుడ్ లో వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాను అని చెబుతుందట. అవును తెలుగు సినిమా చేతిలో లేకపోయినప్పటికి రెజీనా చేతిలో ఇప్పుడు 6 తమిళ సినిమాలున్నాయట. ఈ విషయం తెలిసిన వాళ్ళు షాకవుతున్నారు. ఎక్కడా కనిపించడం లేదు.. అసలు రెజీనా సోషల్ మీడియాలో ఎక్కడా హడావుడి చేయడం లేదు. అయినా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సినిమాలంటే మామూలు విషయం కాదు అని నోరెళ్ళబెడుతున్నారట.
లక్ అంటే అదే మరి. తెలుగు సినిమాలు లేవని ఫీలయ్యే టైం కూడా రెజీనా కి లేదు. అంత బిజీగా తమిళ సినిమాలతో ఉంది. ప్రస్తుతం తమిళంలో ‘సూర్పనాగై’ ‘నెంజమ్ మరప్పతిల్లై’ ‘పార్టీ’ ‘చక్ర’ ‘కళ్లపార్ట్’ ‘కసాదా తపర’ సినిమాలు చేస్తోంది. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ అని సమాచారం. ఈ సినిమాలలో కొన్ని తెలుగులోనూ డబ్ అవబోతున్నాయట. సో ఇలా కూడా తెలుగులో రెజీనా సందడి చేబోతోంది. కాబట్టి రెజీనా తెలుగు సినిమాలు చేయడం లేదని అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. ఇక ఆచార్య లో సాంగ్ గనక హిట్ అయితే ఖచ్చితంగా రెజీనా కి తెలుగు సినిమాలలో మరికొన్ని స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్స్ రావడం పక్కా అంటున్నారు.