JIO: ప్రముఖ బడా టెలికాం సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో మరో రేసుకి సిద్ధమైంది. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసు ప్రారంభించనున్నట్టు రిలయన్స్ జియో రోజు అనగా సోమవారం నాడు ప్రకటించడం విశేషం. దీనికోసం లక్సమ్బర్గ్కు చెందిన టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ అయినటువంటి SESతో భాగస్వామం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ జాయింట్ వెంచర్కు “జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్”గా పేరు పెట్టింది రిలయన్స్.
F 3: ఎఫ్ 3 రిలీజ్ విషయంలో అతిపెద్ద రూమర్స్..చెక్ పెట్టిన మేకర్స్
JIO: పూర్తి వివరాలు:
Jioస్టేషనరీ, మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ఉపయోగించి బ్రాడ్బ్యాండ్ సర్వీసులను రిలయన్స్ జియో, SEC ఈ వెంచర్ కింద పనిచేయనున్నాయి. ఈ సర్వీస్ ద్వారా జనాలకు చేసే మేలు ఏమంటే భారత్లో తక్కువ ధరకే శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీసులు అందే వీలుంది. గరిష్ఠంగా 100 GPS ఇంటర్నెట్ వేగం ఉంటుందని చెబుతున్నారు. శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ను భారత్లో స్టార్ట్ చేయాలని తలచి ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ యత్నించి.. ఫెయిల్ అవ్వడం మనకు తెలిసినదే.
Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా అతను వెళ్తున్నట్లు ముందే రివిల్ చేసేసిన షణ్ముఖ్..!!
స్టార్లింక్ కహాని:
ఇకపోతే స్టార్లింక్, సర్వీసుల కోసం భారత్లో గత సంవత్సరం ప్రీఆర్డర్లు స్వీకరించింది. అయితే ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించిన లైసెన్స్లను స్టార్లింక్కు ప్రభుత్వం నుండి అనుమతి లభించలేదు. దాంతో ప్రీఆర్డర్లు చేసిన యూజర్లకు రీఫండ్ ఇచ్చింది స్టార్లింక్. కానీ లైసెన్స్ కోసం ఇప్పటికీ స్టార్లింక్ ప్రయత్నిస్తోందని సమాచారం. కాగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీసుల కోసం ప్రకటించిన జాయింట్ వెంచర్లో జియో వాటా 51 శాతం అని తెలుస్తోంది. అలాగే SES షేర్ 49శాతం ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?