రిలయెన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జియో రావడం రావడమే మార్కెట్ లో సంచలనాలు సృష్టించింది. జియో ఏం చేసినా సంచలనమే. తాజాగా మరో సంచలనానికి తెర లేపబోతోంది జియో.
మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది జియో. గూగుల్ తో కలిసి ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆర్బిక్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానున్నదట.
రిలయెన్స్ గతంలో ఆర్బిక్ మోడల్ ఫోన్లను విడుదల చేసింది. మళ్లీ తాజాగా అదే పేరుతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందించాలన్న ధ్యేయంతో రిలయెన్స్ అడుగులు వేస్తోంది.
ఆర్సీ545ఎల్ అనే మోడల్ ను రిలయెన్స్ జియో మార్కెట్ లోకి తీసుకురానున్నదట. దీని ధర కేవలం 4 వేలేనట. ఇది క్వాల్ కామ్ క్యూఎమ్ 215 ప్రాసెసర్ తో నడవనుండగా.. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ ను రూపొందించారు.
ఇప్పటికే జియో ఫోన్ తో సంచలనాలకు తెరలేపింది రిలయెన్స్. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చి.. బడ్జెట్ ధరలో అందరికీ స్మార్ట్ ఫోన్లను అందించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది.