చందమామ కాజల్ అగర్వాల్ కి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోలకి కాజల్ మంచి ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో చిరంజీవి కి జంటగా నటిస్తుంది. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ జరిగిన ఈ సినిమా త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతుందట.
ఇక ఈ సినిమా తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఇండియన్ 2 లో కమల్ హాసన్ కి జంటగా నటిస్తోంది కాజల్. శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు భారీ సినిమాలతో పాటు యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మోసగాళ్ళు అన్న టైటిల్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అవుతుంది.
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ రానా దగ్గుబాటి నటించిన పాన్ ఇండియా సినిమా హాతీ మేరీ సాతి. ఈ సినిమాలో కాజల్ గిరిజన యువతిగా గెస్ట్ రోల్ పోషించిందని సమాచారం. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సినిమాకి కాజల్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయట. అందుకు కారణం కేవలం అరగంట నిడివి ఉన్న పాత్ర కోసం దాదాపు 70 లక్షల రెమ్యూనరేషన్ అందుకోవడమే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో గాని కాజల్ కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా అన్న టాక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.