మామూలుగా 5 సీటర్ కారుతో వచ్చిన సమస్య ఏంటంటే.. పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్లు చిన్న కారులో వెళ్లలేరు. అప్పుడు వాళ్లకు రెండు వాహనాలు కావాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎక్కువ మంది ఎటైనా ట్రిప్ కు వెళ్లాలనుకుంటే.. చిన్న కార్లు పనిచేయవు. ఖచ్చితంగా 7 సీటర్ కారు ఉండాల్సిందే.
మరో విషయం ఏంటంటే.. సిటీల్లో 5 సీటర్ కారు సరిపోతుంది. ఎందుకంటే.. అక్కడ చిన్న ఫ్యామిలీలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా పెద్ద కారు ఉండాల్సిందే. అక్కడ ఎక్కువగా ఉమ్మడి ఫ్యామిలీలు ఉంటాయి. అటువంటి వాళ్ల కోసం డిజైన్ చేసిందే ఈ రెనాల్ట్ ట్రైబర్. ఎంపీవీ సిరీస్ ను ఇటీవలే మార్కెట్ లోకి విడుదల చేసింది.
ఇటీవల 7 సీటర్ ఎస్ యూవీని మార్కెట్ లోకి ప్రవేశపెట్టిన రెనాల్ట్.. కరోనాతో సేల్స్ లేక భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
మొత్తం 4 వేరియంట్లతో ట్రైబర్ లభించనుంది. RXE, RXL, RXT, RXZ వేరియంట్లలో ఈ కారు లభించనుంది. ఏఎంటీ గేర్ బాక్స్ తో రానున్న ఈ మోడల్ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లు ఉండనున్నాయి.
బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్ తో 1.0 లీటర్ 3 సిలిండర్ ను ట్రైబర్ లో ఉపయోగించారు. ఇక.. ఈ కారు మరో స్పెషాలిటీ ఏంటంటే.. వెనుక వైపు ఉన్న మూడు సీట్లను తొలగించి లెగ్ స్పేస్ కూడా పొందొచ్చు.
ఇక ఏబీఎస్, ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్ లాంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. ఇక ట్రైబర్ లోని టాప్ మోడల్ లో 8 ఇంచుల టచ్ స్క్రీన్ సిస్టమ్ ను అమర్చింది.
మధ్య తరగతి కుటుంబాలకు ఈ కారు కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఇన్ని మంచి ఫీచర్లతో ఛీప్ అండ్ బెస్ట్ గా వచ్చే కారు అంటే ఇదే. ధర కేవలం 4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మోడల్స్ ను బట్టి ధర 7.22 లక్షల వరకు ఉంటుంది.
ఇక.. అసలైనది మైలేజీ విషయానికి వస్తే.. లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఈ కారు ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మాంచి డిస్కౌంట్ ప్రైస్ లో 7 సీటర్ కారు కావాలంటే వెంటనే రెనాల్ట్ ట్రైబర్ ను కొనేయండి.