సూపర్ స్టార్ మహేష్ బాబు గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు రోబరీ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగాయి. అంత మాత్రమే కాక ఈ సినిమాలో మహేష్ మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండటంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇలాంటి తరుణంలో సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా రేణుదేశాయ్ ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి వస్తున్న వార్తల విషయంలో క్లారిటీ ఇవ్వటం జరిగింది. లైవ్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన క్రమంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాత సినిమాలు మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వాటిలో నిజం ఎంత అని నెటిజన్ ప్రశ్నించడం జరిగింది.
అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రేణుదేశాయ్ తెలిపింది. అంత మాత్రమే కాక అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో యాడ్ చేస్తున్నట్లు, దానికి సంబంధించిన షూటింగ్ మొత్తం ఇటీవల పూర్తయినట్లు త్వరలోనే వివరాలు చెప్తానని రేణుదేశాయ్ తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీ పై తనకు ఎనలేని అభిమానం ఉందని, అందుకనే తెలుగులో సినిమాలు చేస్తున్నట్లు మరో భారీ ప్రాజెక్ట్ కి సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు వాటి విషయాలు త్వరలో షేర్ చేస్తానని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో తమ అభిమాన హీరో సినిమాలో రేణు ఉంటుందని ఎంతగానో ఊహించుకున్న మహేష్ అభిమానులకు తాజాగా రేణు ఇచ్చిన క్లారిటీ తో నీరసం కలిగించినట్లు అయింది.