ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తాజాగా పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారుతోంది.
పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్న తరువాత రేణుదేశాయ్ పూణెలో తన పిల్లలతో నివాసం ఉంటున్నది. ప్రస్తుతం రేణుదేశాయ్ రచయితగా, దర్శకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
రేణుదేశాయ్ కొన్నికవితలు రాస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా రేణుదేశాయ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు పవన్ని ఉద్దేశించే విధంగా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సాధ్యమేనా..మళ్లీ ప్రేమించడం నేర్చుకోవడం
తొలిప్రేమ నాటి ఆ నవ్వు మళ్లీ నవ్వడం
కాలాన్ని రోజుల్లో కాకుండా నిముషాల్లో సెకన్లలో కొలవడం
అద్దంలో చూసుకుంటే కాలం మరుగున పడిన అందమైన ముఖం మళ్లీ కనబడడం
నిద్రని తరిమేసి గగనంలో మెరిసే తారల్లో నీ ముఖం వెదుక్కోవడం
దారి తప్పిన పధికుడు ఒయాసిస్సుకోసం వెదికినట్లు ప్రేమ నిండిన నీ నేత్రాల చూపు కోసం తపన పడడం
చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారే మెత్తని సూర్యకాంతిలా ఒదగడం
సాధ్యమేనా..ఓ క్షణం మెరిసిన నీ జ్ఞాపకంతో గుండె వేగంగా కొట్టుకోవడం
అవును సాధ్యమే..
ఎందుకంటే.. నేను నిన్ను ఎట్లాగో, ఎక్కడో, ఎప్పటినుంచో తెలియకుండా ప్రేమిస్తున్నాను
నువ్వంటే ప్రేమ..ఎందుకంటే ఈ భావ వీచికలకు మరో తోవ తెలియదు మరి..
రేణుదేశాయ్కు ఏడాది క్రితం వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయ్యింది. త్వరలో వివాహం కూడా చేసుకోంటోంది. ఇలాంటి తరుణంలో రేణుదేశాయ్ పోస్టు అభిమానుల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
https://www.instagram.com/p/ByHzEwWB80A/?utm_source=ig_web_copy_link