ఉదయం లేస్తే ఆ విలేఖరి నీతులు చెబుతుంటాడు.ఎదుటి వారి లోతులు తవ్వుతుంటాడు.చివరికి అతను చేసిన పని వెలుగులోకి వచ్చాక ఆశ్చర్యపోవడం అందరి వంతైంది .
తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది.ప్రముఖ దినపత్రిక విలేకరిగా ఉన్న తనను పోలీసులుగాని ఎక్సైజ్ అధికారులు గానీ ఎవరూ ఏమీ చేయలేరనే దీమాతో భారీగా పక్కరాష్ట్రం మద్యం పోగేసుకున్న ఆ రిపోర్టర్ కు ఎక్సైజ్ అధికారులు షాకిచ్చారు.అతడి ఇంటిపై ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో ఏకంగా 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో దొరికే మద్యం కంటే చీప్ గా కర్ణాటక మద్యం దొరుకుతుంది. దీంతో సరిహద్దుల్లోంచి కర్ణాటక వెళ్లిన రిపోర్టర్ తనను ఎవరూ పోలీసులు ఆపరన్న ధైర్యంతో కర్ణాటక మద్యాన్ని భారీగా తెచ్చి కళ్యాణదుర్గంలో నిల్వచేసి అమ్ముతున్నట్టు గుర్తించారు.
కాగా పోలీసుల దాడులతో ప్రస్తుతం సదురు రిపోర్టర్ పరారీలో ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్టు అతడిపై పలు ఆరోపణలున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.ఏదేమైనా పాత్రికేయ రంగం పరువు ఇలాంటి విలేకరుల వల్ల పోతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?