వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎంతటి ఫైర్ బ్రాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీలో ఉన్న దూకుడైన లీడర్లలో ఒకరైన ఆమె పేరు ఆ లిస్టులో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పడం, తడబడకుండా మాట్లాడడం…. ఎంతటివారినైనా ఎదిరించడం రోజాకు ఎన్నోవేళల బలాలుగా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఒక మీడియా ప్రతినిధి రోజా దూకుదికి బలయ్యాడు.
వివరాల్లోకి వస్తే ఒక మీడియా ప్రతినిధి రోజా జబర్దస్త్ లో చేస్తున్న నృత్యాలు గురించి అడిగారు. ఒకానొక దశలో ఆ టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగొందిన రోజా ఆ మక్కువను చంపుకోలేక ఒకటి రెండు టీవీ షో లలో నటిస్తూ ఉంటుంది అని తెలిసిందే. అయితే ప్రత్యేకించి మీడియా ప్రతినిధి రోజా జబర్దస్త్ లోని లేడీ యాంకర్ తో కలిసి చేస్తున్న నృత్యాలు మరియు కొన్ని స్పెషల్ షో లలో డాన్స్ మాస్టర్ శేఖర్ తో చేస్తున్న నృత్యాలు మరియు స్కిట్ లను టార్గెట్ చేస్తున్నట్లు ఈ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
ఆవేశంతో రగిలిపోయిన రోజా తాను ఎప్పటినుండి సినిమా ఫీల్డ్ లో ఉన్నానని…. దానివల్ల ప్రజలకు ఇప్పటి వరకూ ఎలాంటి నష్టం జరగలేదని…. అది ఏమి తప్పు కూడా కాదనట్లు మాట్లాడారు. తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని.. ఇలా పిచ్చి ప్రశ్నలు అడిగి అనవసరంగా తన దృష్టిలో దిగజారవద్దని హెచ్చరించారు. తాను అప్పుడు సినిమాల కోసం రంగు పూసుకున్నా…. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా ఎదిగినా…. న్యాయనిర్ణేతగా జబర్దస్త్ కనిపిస్తున్నా అంతా తన ఆత్మ సంతృప్తి కోసం అని చెప్పా.రు అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేని సమస్య మీడియాకు ఎందుకు వచ్చింది అంటూ ఫైర్ అయిపోయారు. దీంతో ఆమె మాటలు చూసి విస్తుపోవడం సదరు మీదియా వ్యక్తి వంతు అయింది.