టీవీ రేటింగ్ స్కామ్ లో ముంబై పోలీసులు మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. టీఆర్పీ కుంభకోణానికి సంబందించి ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు తాజాగా రిపబ్లిక్ టీవీ సీఈఓ వికాస్ ఖాన్ చాందినీని అరెస్ట్ చేశారు. నితిన్ దియోకర్ పిర్యాదు మేరకు అక్టోబర్ ఆరవ తేదీన వికాస్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో ఇంతకు ముందే రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గత నెల 24వ తేదీన మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ముంబై పోలీసులు ప్రస్తుతం రెండవ ఛార్జిషీట్ దాఖలు చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 140 మంది సాక్షులను విచారించినట్లు తెలిసింది