తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లోలో అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 43 గంటల తర్వాత విజయవంతం అయ్యింది. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో అధికారులు, యువకుడి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే ..కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం రెడ్డిపేట నుండి గన్ పూర తండ మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో షికారుకి వెళ్లాడు. షికారు చేస్తున్న సమయంలో రాళ్లపై వెళుతుండగా సెల్ ఫోన్ జారి కిందపడింది. ఆ పోన్ కోసం ప్రయత్నిస్తుండగా రాళ్ల మధ్యలో ఉన్న గుహలో రాజు పడిపోయాడు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అందులోనే ఉండిపోయాడు. అయితే చీకటిపడినప్పటికీ రాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బుధవారం ఉదయమే అడవికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. రాళ్ల గుహలో నుండి రాజు అరుస్తుండటం గమనించి అటుగా వెళ్లి పరిశీలించగా రాజు గుహలో చిక్కుకుపోయిన ఉన్నాడు. రాజును బయటకు తీసే అవకాశం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
అటవీ శాఖ, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని నిన్నటి నుండి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు జేసీబీని తెప్పించి జాగ్రత్తగా బండరాళ్లను ఒక్కటొక్కటిగా తొలగించారు. దాదాపు 43 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బండ రాళ్ల మధ్య పడిపోయి ఉన్న షాడ రాజును సురక్షితంగా బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజు కుటుంబ సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయి రాజు క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు 43 గంటలకు పైగా రాళ్ల మధ్య చిక్కుకుని ఉండటంతో ఆయనకు ప్రధమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
కేసిఆర్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ .. తెలంగాణపై సుప్రీం కోర్టుకెక్కిన ఏపీ
Police officials are conducting rescue operations… deployed JCB and breaking the rocks to save Raju, who has been #Trapped inside a cave for over 40 hours in #Kamareddy dist.#Telangana #TrappedinCave #Rescue #RescueOperation #Stuck pic.twitter.com/3UM5JdVXwK
— Surya Reddy (@jsuryareddy) December 15, 2022